పాక్షిక లాక్ డౌన్ దిశగా ఒమన్...
- March 02, 2021
మస్కట్:ఒవైపు కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతుండటం..మరోవైపు సెకండ్ వేవ్ ముప్పు వెంటాడుతున్న నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా చర్యలు తీసుకుంటోంది. కఠిన నిర్ణయాలతో మళ్లీ పాక్షిక లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి రాత్రి వేళలో వాణిజ్య కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 4 నుంచి 20 వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవా కేంద్రాలు మినహా వాణిజ్య కేంద్రాలను మూసివేయాలని ఒమన్ సుప్రీం కమిటీ ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే..పెట్రోల్ బంకులు, ఆరోగ్య కేంద్రాలతో పాటు అన్ని మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చామని వివరించింది. పబ్లిక్ స్కూళ్లలో కూడా మార్చి 7 నుంచి 11 వరకు ఆన్ లైన్ బోధనా విధానాన్నే అమలు చేయాలని పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఒమన్)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







