తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 02, 2021
హైదరాబాద్:తెలంగాణలో ఇవాళ కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 163 పాజిటివ్ కేసులు నమోదవగా...ఒక మరణం సంభవించింది. అదే సమయంలో 157 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,086కు చేరుకోగా.. 2,95,544 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1635 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.81 శాతంగా ఉందని.. ప్రస్తుతం 1,907 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 774 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 40,181 శాంపిల్స్ టెస్ట్ చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 2,35,389కు చేరిందని బులెటిన్లో పేర్కొన్నారు అధికారులు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







