తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- March 02, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణలో ఇవాళ కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 163 పాజిటివ్ కేసులు నమోదవగా...ఒక మరణం సంభవించింది. అదే సమయంలో 157 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,99,086కు చేరుకోగా.. 2,95,544 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1635 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.81 శాతంగా ఉందని.. ప్రస్తుతం 1,907 యాక్టివ్‌ కేసులు ఉండగా.. అందులో 774 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 40,181 శాంపిల్స్ టెస్ట్‌ చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,35,389కు చేరిందని బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.  

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com