పర్యాటక రంగంలోని కేఫ్ లు,రెస్టారెంట్లు పాక్షికంగా మాసివేత

- March 03, 2021 , by Maagulf
పర్యాటక రంగంలోని కేఫ్ లు,రెస్టారెంట్లు పాక్షికంగా మాసివేత

మస్కట్:పర్యాటక శాఖలోని రెస్టారెంట్లు,కేఫ్ లలో కోవిడ్ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది పర్యాటక మంత్రిత్వ శాఖ.కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో సూప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా సుల్తానేట్ గర్నరేట్లలోని పర్యాటక రంగంలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్ లు పాక్షిక మూసివేత సమయాలను పాటించాలని వెల్లడించింది.రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రెస్టారెంట్లు, కేఫ్ లు పూర్తిగా మూసివేయాలని..వినియోగదారులకు సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. మార్చి 4 నుంచే అమలులోకి వచ్చిన ఈ పాక్షిక మూసివేత నిబంధనలు మార్చి 20 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఎవరైనా సుప్రీం కమిటీ సూచనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com