తెలంగాణ గవర్నర్కు ప్రతిష్టాత్మక అవార్డు
- March 04, 2021
హైదరాబాద్:తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. ఇక, తాజాగా, పుదుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు చేపట్టి.. అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు.. ఇప్పుడు గవర్నర్ తమిళిసైని ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు వరించింది..యూఎస్ కాంగ్రస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా.తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు.గవర్నర్ తో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.9వ వార్షిక కాంగ్రషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది.సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా.తమిళిసై సౌందరరాజన్ను ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.
తాజా వార్తలు
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!