తెలంగాణ గవర్నర్కు ప్రతిష్టాత్మక అవార్డు
- March 04, 2021
హైదరాబాద్:తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. ఇక, తాజాగా, పుదుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు చేపట్టి.. అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు.. ఇప్పుడు గవర్నర్ తమిళిసైని ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు వరించింది..యూఎస్ కాంగ్రస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా.తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు.గవర్నర్ తో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.9వ వార్షిక కాంగ్రషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది.సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా.తమిళిసై సౌందరరాజన్ను ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







