‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
- March 04, 2021హైదరాబాద్:‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా’తో తెలుగులో అరంగేట్రం చేసిన నవీన్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘జాతి రత్నాలు’. ఈ సినిమా ఈ నెల11న విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాహ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ‘జాతి రత్నాలు’ ట్రైలర్ను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ విడుదల కోసం ముంబైలో ఉన్న ప్రభాస్ ను కలవడానికి వెళ్ళింది చిత్రబృందం. ఈ సందర్భంగా వారితో ప్రభాస్ సరదాగా కాసేపు గడిపారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్ తోనే ఇంత నవ్వుకున్నానంటే సినిమా చూస్తే ఎలా ఉంటాడో ఊహించగలను’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ