కువైట్లోని భారత ఎంబసీ సేవలు మార్చి 11 వరకు నిలిపివేత
- March 04, 2021
కువైట్ సిటీ:కువైట్లోని భారత ఎంబసీలో సాధారణ సేవలను మార్చి 11 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ముందస్తు ఎంబసీ కార్యాలయం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 3, 4వ తేదీల్లో సాధారణ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత సేవల నిలిపివేతను మరికొన్నాళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. దీంతో మార్చి 11 వరకు ఎంబసీలో సాధారణ సేవలు అందుబాటులో ఉండవు. అప్పటివరకు ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే..డెత్ కేస్ రిజిస్ట్రేషన్స్, ఐసీడబ్ల్యూఏఫ్ అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!









