కువైట్లోని భారత ఎంబసీ సేవలు మార్చి 11 వరకు నిలిపివేత
- March 04, 2021
కువైట్ సిటీ:కువైట్లోని భారత ఎంబసీలో సాధారణ సేవలను మార్చి 11 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ముందస్తు ఎంబసీ కార్యాలయం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 3, 4వ తేదీల్లో సాధారణ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత సేవల నిలిపివేతను మరికొన్నాళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. దీంతో మార్చి 11 వరకు ఎంబసీలో సాధారణ సేవలు అందుబాటులో ఉండవు. అప్పటివరకు ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే..డెత్ కేస్ రిజిస్ట్రేషన్స్, ఐసీడబ్ల్యూఏఫ్ అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







