కర్ఫ్యూ టైంలో మధ్యాహ్నం 2 గంటలకే బ్యాంకులు బంద్
- March 06, 2021
కువైట్:మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కువైట్లోని బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంటాయని బ్యాంకర్లు స్పష్టం చేశారు. కరోనా తీవ్రత పెరగటంతో రేపటి నుంచి దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు, మసీదులో ప్రార్ధనలు, డెలివరీ సర్వీసులకు మినహా అన్ని రంగాల్లో కర్ఫ్యూ నిబంధనలు వర్తించనున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన బ్యాంకర్లు..మంత్రిమండలి నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులను మధ్యాహ్నం రెండు గంటలకే మూసివేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో బ్యాంకు సిబ్బంది పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతం సిబ్బందికి మాత్రమే విధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







