కర్ఫ్యూ టైంలో మధ్యాహ్నం 2 గంటలకే బ్యాంకులు బంద్
- March 06, 2021
కువైట్:మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కువైట్లోని బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంటాయని బ్యాంకర్లు స్పష్టం చేశారు. కరోనా తీవ్రత పెరగటంతో రేపటి నుంచి దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు, మసీదులో ప్రార్ధనలు, డెలివరీ సర్వీసులకు మినహా అన్ని రంగాల్లో కర్ఫ్యూ నిబంధనలు వర్తించనున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన బ్యాంకర్లు..మంత్రిమండలి నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులను మధ్యాహ్నం రెండు గంటలకే మూసివేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో బ్యాంకు సిబ్బంది పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతం సిబ్బందికి మాత్రమే విధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







