కర్ఫ్యూ టైంలో మధ్యాహ్నం 2 గంటలకే బ్యాంకులు బంద్
- March 06, 2021
కువైట్:మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కువైట్లోని బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంటాయని బ్యాంకర్లు స్పష్టం చేశారు. కరోనా తీవ్రత పెరగటంతో రేపటి నుంచి దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు, మసీదులో ప్రార్ధనలు, డెలివరీ సర్వీసులకు మినహా అన్ని రంగాల్లో కర్ఫ్యూ నిబంధనలు వర్తించనున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన బ్యాంకర్లు..మంత్రిమండలి నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులను మధ్యాహ్నం రెండు గంటలకే మూసివేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో బ్యాంకు సిబ్బంది పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతం సిబ్బందికి మాత్రమే విధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!