కోవిడ్ రూల్ బ్రేక్ చేస్తే దేశ బహిష్కరణ
- March 07, 2021
కువైట్: కోవిడ్ నిబంధనలు ప్రవాసీయులు, పౌరులు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని కువైట్ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. వైరస్ తీవ్రత అదుపులోకి రాకపోగా..సెకండ్ ప్రమాదం కూడా వెంటాడుతుండటంతో కువైట్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచే అమలులోకి రానుంది. సాయంత్రం 5 నుంచి 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ప్రవాసీయులు అయితే దేశం నుంచి బహిష్కరిస్తామని, పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







