కోవిడ్ రూల్ బ్రేక్ చేస్తే దేశ బహిష్కరణ
- March 07, 2021కువైట్: కోవిడ్ నిబంధనలు ప్రవాసీయులు, పౌరులు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని కువైట్ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. వైరస్ తీవ్రత అదుపులోకి రాకపోగా..సెకండ్ ప్రమాదం కూడా వెంటాడుతుండటంతో కువైట్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచే అమలులోకి రానుంది. సాయంత్రం 5 నుంచి 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ప్రవాసీయులు అయితే దేశం నుంచి బహిష్కరిస్తామని, పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ