కోవిడ్ రూల్ బ్రేక్ చేస్తే దేశ బహిష్కరణ

- March 07, 2021 , by Maagulf
కోవిడ్ రూల్ బ్రేక్ చేస్తే దేశ బహిష్కరణ

కువైట్: కోవిడ్ నిబంధనలు ప్రవాసీయులు, పౌరులు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని కువైట్ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. వైరస్ తీవ్రత అదుపులోకి రాకపోగా..సెకండ్ ప్రమాదం కూడా వెంటాడుతుండటంతో కువైట్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచే అమలులోకి రానుంది. సాయంత్రం 5 నుంచి 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ప్రవాసీయులు అయితే దేశం నుంచి బహిష్కరిస్తామని, పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com