కోవిడ్ రూల్ బ్రేక్ చేస్తే దేశ బహిష్కరణ
- March 07, 2021కువైట్: కోవిడ్ నిబంధనలు ప్రవాసీయులు, పౌరులు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని కువైట్ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. వైరస్ తీవ్రత అదుపులోకి రాకపోగా..సెకండ్ ప్రమాదం కూడా వెంటాడుతుండటంతో కువైట్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచే అమలులోకి రానుంది. సాయంత్రం 5 నుంచి 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ప్రవాసీయులు అయితే దేశం నుంచి బహిష్కరిస్తామని, పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ