కేంద్ర బడ్జెట్ పరీక్ష : మోదీ
- February 28, 2016
పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరీక్షలను కేవలం మార్కులతో ముడి పెట్టొద్దని పేర్కొన్నారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 'విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయి.. అలాగే నాకు కూడా రేపు కేంద్ర బడ్జెట్ పరీక్ష ఉంది.. 125 కోట్ల భారతీయులు రేపు నన్ను పరీక్షించనున్నారంటూ కేంద్ర బడ్జెట్పై మోదీ వ్యాఖ్యానించారు.రేపు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నామనీ, తన పరీక్షతోపాటు విద్యార్థుల పరీక్షలూ సఫలమవుతాయని ఆశిస్తున్నానంటూ మోదీ చెప్పారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







