కేంద్ర బడ్జెట్‌ పరీక్ష : మోదీ

- February 28, 2016 , by Maagulf
కేంద్ర బడ్జెట్‌ పరీక్ష : మోదీ

పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరీక్షలను కేవలం మార్కులతో ముడి పెట్టొద్దని పేర్కొన్నారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 'విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయి.. అలాగే నాకు కూడా రేపు కేంద్ర బడ్జెట్‌ పరీక్ష ఉంది.. 125 కోట్ల భారతీయులు రేపు నన్ను పరీక్షించనున్నారంటూ కేంద్ర బడ్జెట్‌పై మోదీ వ్యాఖ్యానించారు.రేపు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నామనీ, తన పరీక్షతోపాటు విద్యార్థుల పరీక్షలూ సఫలమవుతాయని ఆశిస్తున్నానంటూ మోదీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com