దుబాయ్ లో 1 మిలియన్ దినార్ల విమానటికెట్లు అమ్మిన మోసగాళ్ళు
- February 28, 2016
విమాన టికెట్లు 'డెడ్ చీప్' గా లభిస్తున్నాయని పలువురు ఎగబడి జోరుగా కొన్నారు, వాటితో చవకగా విమానంలో ప్రయణిద్ధామని ఆశపడ్డారు. ఆ టికెట్లు నకిలీవని పోలీసులు తేల్చడంతో వీటిని కొన్నవారు తాము మోసపోయామని తెల్సుకొని లబోదిబోమంటున్నారు, ఈ నకిలీల భాగోతం దుబాయ్ పోలీసులు ఛేదించారు. 2015 నుంచి మోసపూరితంగా విమాన టికెట్లను బుకింగ్ చేసిన 381 మందిని ఈ కేసు లో పట్టుకొన్నట్లు లెఫ్టినెంట్ కల్నల్, డైరెక్టర్, సైబర్ క్రైమ్స్ దుబాయ్ పోలీస్ సయీద్ అల్ హజ్రి తెలిపారు. దుబాయ్ లో ఆరుగురు మోసగాళ్ళు సామాజిక మాధ్యమం ద్వారా బ్యాంకింగ్, విమానరంగంకు తీవ్ర ఆర్ధిక నష్టం కల్గించారు. ఒక మిలియన్ దినార్ల విలువ చేసే నకిలీ టికెట్లను విక్రయించాడని పోలీసులు చెప్పారు. ఈ తరహ మోసం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్లను తస్కరిచాడు. దుబాయ్ పోలీస్ నేర పరిశోధన శాఖ (సిఐడి) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మోసగాళ్ళు రెండు రకాల మోసాలను వీరి వలలో పడిన వారిపై ప్రయోగిస్తారు, ఇందులో మొదటిది లేని విమానం టికెట్లను నకిలీ టిక్కెట్లు సృష్టించి వాటిని అమ్మడం... రెండవ మార్గ మోసం ఏమిటంటే, తమ వద్ద ఉన్న వాస్తవమైన విమాన టికెట్లను ఆన్ లైన్ లో చూపించి, ప్రయాణికుల క్రెడిట్ కార్డు నుంచి డబ్బును దొంగిలించడం జరుగుతుందని చెప్పారు. అయెతే రెండవ రకం మోసం లో అంతర్జాతీయ ముఠాలకు స్వదేశంకు చెందిన కొందరు భాగస్వాములు ఉన్నారని ఆయన అన్నారు. ' రండి...త్వరగా కొనండి ..చవక ధరలకు విమాన ప్రయాణం చేయండి ' అంటూ ఇంటర్నెట్ మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రకటనలను తమను ఎంతో ఆకర్షించాయని బాధితులు గగ్గోలు పెడుతున్నారు, వీరి మోసాన్ని గ్రహించి పట్టుకొనేందుకు ఎయిర్లైన్స్, బ్యాంకులు మరియు ఇంటర్పోల్ 60 నుంచి 80 అంతర్జాతీయ సంబంధిత సంస్థలు మధ్య సమన్వయం మరియు సహకారంతో వీరిని ఏకకాలంలోఅరెస్టు చేసినట్లు నివేదిక వెల్లడించింది. తమకు తోబుట్టువుల మాదిరి దళారులు లేరని దయచేసి వారి ఉచ్చులో పడవద్దని లెఫ్టినెంట్ కల్నల్ అల్ హజ్రి సూచించారు. విమాన టికెట్లు పొందాలంటే ప్రయాణికులు నేరుగా సంస్థ కార్యాలయాల ద్వారా పొందాలని లేదా సంస్థ అధికారిక వెబ్సైట్ల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







