దుబాయ్ లో 1 మిలియన్ దినార్ల విమానటికెట్లు అమ్మిన మోసగాళ్ళు
- February 28, 2016
విమాన టికెట్లు 'డెడ్ చీప్' గా లభిస్తున్నాయని పలువురు ఎగబడి జోరుగా కొన్నారు, వాటితో చవకగా విమానంలో ప్రయణిద్ధామని ఆశపడ్డారు. ఆ టికెట్లు నకిలీవని పోలీసులు తేల్చడంతో వీటిని కొన్నవారు తాము మోసపోయామని తెల్సుకొని లబోదిబోమంటున్నారు, ఈ నకిలీల భాగోతం దుబాయ్ పోలీసులు ఛేదించారు. 2015 నుంచి మోసపూరితంగా విమాన టికెట్లను బుకింగ్ చేసిన 381 మందిని ఈ కేసు లో పట్టుకొన్నట్లు లెఫ్టినెంట్ కల్నల్, డైరెక్టర్, సైబర్ క్రైమ్స్ దుబాయ్ పోలీస్ సయీద్ అల్ హజ్రి తెలిపారు. దుబాయ్ లో ఆరుగురు మోసగాళ్ళు సామాజిక మాధ్యమం ద్వారా బ్యాంకింగ్, విమానరంగంకు తీవ్ర ఆర్ధిక నష్టం కల్గించారు. ఒక మిలియన్ దినార్ల విలువ చేసే నకిలీ టికెట్లను విక్రయించాడని పోలీసులు చెప్పారు. ఈ తరహ మోసం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్లను తస్కరిచాడు. దుబాయ్ పోలీస్ నేర పరిశోధన శాఖ (సిఐడి) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మోసగాళ్ళు రెండు రకాల మోసాలను వీరి వలలో పడిన వారిపై ప్రయోగిస్తారు, ఇందులో మొదటిది లేని విమానం టికెట్లను నకిలీ టిక్కెట్లు సృష్టించి వాటిని అమ్మడం... రెండవ మార్గ మోసం ఏమిటంటే, తమ వద్ద ఉన్న వాస్తవమైన విమాన టికెట్లను ఆన్ లైన్ లో చూపించి, ప్రయాణికుల క్రెడిట్ కార్డు నుంచి డబ్బును దొంగిలించడం జరుగుతుందని చెప్పారు. అయెతే రెండవ రకం మోసం లో అంతర్జాతీయ ముఠాలకు స్వదేశంకు చెందిన కొందరు భాగస్వాములు ఉన్నారని ఆయన అన్నారు. ' రండి...త్వరగా కొనండి ..చవక ధరలకు విమాన ప్రయాణం చేయండి ' అంటూ ఇంటర్నెట్ మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రకటనలను తమను ఎంతో ఆకర్షించాయని బాధితులు గగ్గోలు పెడుతున్నారు, వీరి మోసాన్ని గ్రహించి పట్టుకొనేందుకు ఎయిర్లైన్స్, బ్యాంకులు మరియు ఇంటర్పోల్ 60 నుంచి 80 అంతర్జాతీయ సంబంధిత సంస్థలు మధ్య సమన్వయం మరియు సహకారంతో వీరిని ఏకకాలంలోఅరెస్టు చేసినట్లు నివేదిక వెల్లడించింది. తమకు తోబుట్టువుల మాదిరి దళారులు లేరని దయచేసి వారి ఉచ్చులో పడవద్దని లెఫ్టినెంట్ కల్నల్ అల్ హజ్రి సూచించారు. విమాన టికెట్లు పొందాలంటే ప్రయాణికులు నేరుగా సంస్థ కార్యాలయాల ద్వారా పొందాలని లేదా సంస్థ అధికారిక వెబ్సైట్ల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







