షార్జా లో పాదాచారులకు ఐదు వంతెనలు
- February 28, 2016
ఎమరేట్స్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఐదు పాదచారుల వంతెనలు నిర్మించాలని షార్జా పట్టణ ప్రణాళిక మండలి (షార్జా అర్బన్ ప్లానింగ్ కౌన్సిల్) ఆమోదించింది. షార్జా రహదారులు మరియు రవాణా సంస్థ సహకారంతో, ఐదు పాదచారుల వంతెనలు నమూనాలు రూపొందంచాబడ్డాయి. ఈ ఐదు పాదచారుల వంతెనలు ఏమిటంటే , కింగ్ ఫైసల్ రోడ్డు, కింగ్ అబ్దుల్ అజిజ్ వీధి , అల్ ఇట్టిహాడ్ రోడ్ మరియు అల్ తావున్ రోడ్డు రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఇవి నిర్మించబడనున్నాయి. ఈ వంతెనలు ప్రత్యేక అవసరాలు ఉన్న వృద్ధ మరియు ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించనున్నాయి. లిఫ్టులు మరియు కాలి బాటలు వంతెనకు బిగించి ఉంటుంది. షార్జా పట్టణ ప్రణాళిక మండలి చైర్మన్, షేక్ ఖలీద్ బిన్ సుల్తాన్ అల్ క్యసిం ఈ సందర్భంగా మాట్లాడుతూ షార్జ ఎమిరేట్ లో పౌరులు, నివాసితులు మరియు సందర్శకులు కోసం నాణ్యతతో కూడిన సేవలను అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ,అలాగే , ఈ ఐదు పాదాచారుల వంతెనల నిర్మాణ విషయంలో "మేము స్థిరంగా మద్దతు పలుకుతున్నామని , ఈ రకమైన ప్రాజెక్టుల వలన ఎంతో ఆకర్షణీయం కలిగి ఉంటాయని అన్నారు. వీటిని షార్జా పట్టణ ప్రణాళిక మండలి పటిష్టంగా రూపొందించడంలో ఎంతో ముఖ్య ప్రాధాన్యత ఉంది.షార్జా నగరంలో ప్రధాన రహదారులు వద్ద పాదచారుల భద్రత మెరుగుపడే విధంగా వీటి ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







