ఈవెంట్లకు హాజరయ్యే అతిథులు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే
- March 09, 2021
అబుధాబి:అబుధాబిలో నిర్వహించే ఏ ఈవెంట్లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది పాలనా యంత్రాంగం. బిజినెస్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఈవెంట్ కు వెళ్లే 48 గంటలలోపు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు వివరించింది. అలాగే ఈవెంట్ నిర్వాహకులు కూడా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. వారంపైగా నిర్వహించే ఈవెంట్లైతే ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్లకు సంబంధించి ఎంత మందికి అనుమతి ఇవ్వాలనేది కూడా అబుధాబి పాలనా యంత్రాంగం ఖరారు చేసింది. ప్రైవేట్ బీచులు, స్విమ్మింగ్ పూల్స్ లో 60 శాతం, బిజినెస్ ఈవెంట్లకు 50 శాతం, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు పూర్తి సామర్థ్యంలో 30 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్వాహకులు కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







