ఈవెంట్లకు హాజరయ్యే అతిథులు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే
- March 09, 2021
అబుధాబి:అబుధాబిలో నిర్వహించే ఏ ఈవెంట్లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది పాలనా యంత్రాంగం. బిజినెస్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఈవెంట్ కు వెళ్లే 48 గంటలలోపు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు వివరించింది. అలాగే ఈవెంట్ నిర్వాహకులు కూడా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. వారంపైగా నిర్వహించే ఈవెంట్లైతే ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్లకు సంబంధించి ఎంత మందికి అనుమతి ఇవ్వాలనేది కూడా అబుధాబి పాలనా యంత్రాంగం ఖరారు చేసింది. ప్రైవేట్ బీచులు, స్విమ్మింగ్ పూల్స్ లో 60 శాతం, బిజినెస్ ఈవెంట్లకు 50 శాతం, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు పూర్తి సామర్థ్యంలో 30 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్వాహకులు కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







