ఈవెంట్లకు హాజరయ్యే అతిథులు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే
- March 09, 2021
అబుధాబి:అబుధాబిలో నిర్వహించే ఏ ఈవెంట్లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది పాలనా యంత్రాంగం. బిజినెస్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఈవెంట్ కు వెళ్లే 48 గంటలలోపు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు వివరించింది. అలాగే ఈవెంట్ నిర్వాహకులు కూడా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. వారంపైగా నిర్వహించే ఈవెంట్లైతే ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్లకు సంబంధించి ఎంత మందికి అనుమతి ఇవ్వాలనేది కూడా అబుధాబి పాలనా యంత్రాంగం ఖరారు చేసింది. ప్రైవేట్ బీచులు, స్విమ్మింగ్ పూల్స్ లో 60 శాతం, బిజినెస్ ఈవెంట్లకు 50 శాతం, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు పూర్తి సామర్థ్యంలో 30 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్వాహకులు కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025