జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- September 24, 2025
మనామా: బహ్రెయిన్ లో సంచలనం సృష్టించిన హై ప్రొఫైల్ "జా జైలు హత్య" కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదును కాసేషన్ కోర్టు ఖరారు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న సమయంలో మరణించిన తర్వాత మూడవ అప్పీలుదారుడిపై ఉన్న అభియోగాలను ఈ సందర్భంగా కోర్టు కొట్టివేసింది.
ఈ కేసు అక్టోబర్ 2023లో జా రిహాబిలిటేషన్ అండ్ రిఫార్మ్ సెంటర్లో నమోదైంది. నలుగురు ఖైదీలు మరొక ఖైదీపై ప్రాణాంతకంగా దాడికి పాల్పడ్డారు. భోజనం విషయంలో జరిగిన వివాదం తర్వాత నిందితులు బాధితుడిపై దాడి చేశారని, అతను స్పృహ కోల్పోయే వరకు తల మరియు ముఖంపై పదేపదే కొట్టి చంపారని దర్యాప్తులో తేలింది. హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు గతంలో జారీ చేసిన జీవిత ఖైదులను కాసేషన్ కోర్టు తాజాగా ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









