జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- September 24, 2025
మనామా: బహ్రెయిన్ లో సంచలనం సృష్టించిన హై ప్రొఫైల్ "జా జైలు హత్య" కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదును కాసేషన్ కోర్టు ఖరారు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న సమయంలో మరణించిన తర్వాత మూడవ అప్పీలుదారుడిపై ఉన్న అభియోగాలను ఈ సందర్భంగా కోర్టు కొట్టివేసింది.
ఈ కేసు అక్టోబర్ 2023లో జా రిహాబిలిటేషన్ అండ్ రిఫార్మ్ సెంటర్లో నమోదైంది. నలుగురు ఖైదీలు మరొక ఖైదీపై ప్రాణాంతకంగా దాడికి పాల్పడ్డారు. భోజనం విషయంలో జరిగిన వివాదం తర్వాత నిందితులు బాధితుడిపై దాడి చేశారని, అతను స్పృహ కోల్పోయే వరకు తల మరియు ముఖంపై పదేపదే కొట్టి చంపారని దర్యాప్తులో తేలింది. హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు గతంలో జారీ చేసిన జీవిత ఖైదులను కాసేషన్ కోర్టు తాజాగా ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









