57 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

- March 10, 2021 , by Maagulf
57 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

తిరుమల:తిరుమలలోని వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 57 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా వేద పాఠశాలలో తరగతులు నడుస్తున్నాయి.

విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందులో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో 450 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అయితే వారిలో 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వెంటనే విద్యార్థులందరినీ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com