ఏపీలో కరోనా కేసుల వివరాలు

- March 14, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి.దేశంలో తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తున్న విషయం. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,91,861 కి చేరింది.ఇందులో 8,83,277 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1400 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7184కి చేరింది.గడిచిన 24 గంటల్లో ఏపీలో 164 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com