విద్యార్ధికి ల్యాప్టాప్ బహుకరించిన గవర్నర్
- March 15, 2021
హైదరాబాద్: ఆన్లైన్లో తన ఉన్నత చదువులకు ల్యాప్టాప్ అవసరమని సోషల్ మీడియాలో సాయం కోరిన డిఫార్మసీ విద్యార్ధికి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. సదరు విద్యార్ధికి గవర్నర్ నిధి నుంచి కొనుగోలుచేసిన ల్యాప్టాప్ను విద్యార్ధికి అందజేశారు. విషయానికి వస్తే రంగారెడ్డిజిల్లా చేగూర్ గ్రామానికి చెందిన విద్యార్ధి బి. ప్రమోద్ డిఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపధ్యంలో ప్రస్తుతం చాలా విద్యాసంస్థలు ఆన్లైన్ద్వారానే క్లాసులు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. అయితే తనకు ల్యాప్టాప్ లేక పోవడం వల్ల ఆన్లైన్ క్లాసులను అటెండ్కాలేకపోతున్నాని, తనకు ల్యాప్టాప్ సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తిచేశారు. దీనికి స్పందించిన గవర్నర్ తమిళిసై ఆ విద్యార్ధిని రాజ్భవన్కు పిలిపించి ల్యాప్టాప్ను అందజేశారు.
ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న విద్యార్ధి తను ఎంచుకున్న రంగంలో మరింత ముందుకు పోయి మంచి ఫలితాలుసాధించాలని అన్నారు. నువ్వుకూడా ఎంచుకున్నరంగంలో రాణిస్తూ పేదలకు సహాయం చేయాలని కోరారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలని సూచించారు. తాను ఓ చిన్నరైతు కుటుంబానికిచెందిన వాడినని, తనకు ల్యాప్టాప్కొనే స్థోమత లేదని విద్యార్ధి ప్రమోద్ ఈసందర్భగా తెలిపారు. గవర్నర్ మేడం ఎంతో దయతలచి తనకు చేసిన సాయం మరువలేనని చెప్పారు. అలాగే భవిష్యత్లో తానూ సేవాదృక్పధంతో జీవిస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







