భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 16, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అటు మహారాష్ట్రతో పాటుగా మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 24,492 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 114,09,831 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,10,27,543 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,23,432 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 131 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,58, 856కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 20,191 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తన కరోనా బులెటిన్ లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..