తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- March 16, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 204 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 170 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,522 కు చేరగా.. రికవరీ కేసులు 2,97,851 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,656  మంది మృతిచెందారు.. రికవరీ రేటు దేశంలో 96.6 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.78 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 2015 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 624 మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com