పగటి పూట జనసందోహంపై ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరికలు
- March 16, 2021
కువైట్: సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు ఝామున 5 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ అమల్లో వున్నప్పటికీ, ఉదయం పూట ఎక్కువమంది జనం ఒకే చోట వివిధ కారణాలతో పోగవుతుండడం వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎలాంటి లక్షణాలూ బయటపడకుండానే కరోనా వైరస్ కలిగి వున్న వ్యక్తులు ఇతరులకు వ్యాధిని వ్యాపింపజేస్తున్నారని, ఆ కారణంగానే కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఒకే వాహనంలో బృందంగా ఎక్కువమంది ప్రయాణించే సందర్భంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరగడానికి ఆస్కారం వుంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమావేశాలకు అవకాశాలు తక్కువ వుండడంతో అవి పగటిపూట ఎక్కువ జరిగి, కరోనా వ్యాప్తికి కారణమవుతున్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం