పగటి పూట జనసందోహంపై ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరికలు

- March 16, 2021 , by Maagulf
పగటి పూట జనసందోహంపై ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరికలు

కువైట్: సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు ఝామున 5 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ అమల్లో వున్నప్పటికీ, ఉదయం పూట ఎక్కువమంది జనం ఒకే చోట వివిధ కారణాలతో పోగవుతుండడం వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎలాంటి లక్షణాలూ బయటపడకుండానే కరోనా వైరస్ కలిగి వున్న వ్యక్తులు ఇతరులకు వ్యాధిని వ్యాపింపజేస్తున్నారని, ఆ కారణంగానే కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఒకే వాహనంలో బృందంగా ఎక్కువమంది ప్రయాణించే సందర్భంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరగడానికి ఆస్కారం వుంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమావేశాలకు అవకాశాలు తక్కువ వుండడంతో అవి పగటిపూట ఎక్కువ జరిగి, కరోనా వ్యాప్తికి కారణమవుతున్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com