ప్రయాణికుల కోసం ఈ-పోర్టల్ ప్రారంభించిన సౌదీ ఏవియేషన్
- March 17, 2021
సౌదీ:ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు సౌదీ సివిల్ ఏవియేషన్ ఈ-పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పోర్టల్ సేవలను ప్రారంభించింది. ఈ-పోర్టల్ ద్వారా సౌదీ పౌర విమానయాన సంస్థ ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. వినియోగదారులకు సంతృప్తికర సేవలను అందించటం, సర్వీస్ లో క్వాలిటీ పెంచటమే ఈ-పోర్టల్ లక్ష్యం. వినియోగదారులు తమకు కావాల్సిన సమాచారాన్ని, ప్రయాణ వివరాలను, తమ అందాల్సిన సేవలను డిజిటల్ సహాయంతో క్షణాల్లోనే పొందవచ్చు. ట్విట్టర్ ద్వారా ఆటోమెటిక్ రెస్పాన్స్ వచ్చేలా ఈ-పోర్టల్ టెక్నాలజీ వినియోగదారులకు సేవలు అందించనుంది. అలాగే 8001168888 నెంబర్ ద్వారా సుక్షితులైన సిబ్బంది వినియోగదారులకు తగిన సమాచారం అందిస్తుంది. అలాగే వినియోగదారుల హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ ప్రత్యేక సర్వీస్ నెంబర్ ద్వారా అభ్యంతరాలను వ్యక్తం చేసి తగిన సేవలను పొందవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







