ప్రయాణికుల కోసం ఈ-పోర్టల్ ప్రారంభించిన సౌదీ ఏవియేషన్
- March 17, 2021
సౌదీ:ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు సౌదీ సివిల్ ఏవియేషన్ ఈ-పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పోర్టల్ సేవలను ప్రారంభించింది. ఈ-పోర్టల్ ద్వారా సౌదీ పౌర విమానయాన సంస్థ ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. వినియోగదారులకు సంతృప్తికర సేవలను అందించటం, సర్వీస్ లో క్వాలిటీ పెంచటమే ఈ-పోర్టల్ లక్ష్యం. వినియోగదారులు తమకు కావాల్సిన సమాచారాన్ని, ప్రయాణ వివరాలను, తమ అందాల్సిన సేవలను డిజిటల్ సహాయంతో క్షణాల్లోనే పొందవచ్చు. ట్విట్టర్ ద్వారా ఆటోమెటిక్ రెస్పాన్స్ వచ్చేలా ఈ-పోర్టల్ టెక్నాలజీ వినియోగదారులకు సేవలు అందించనుంది. అలాగే 8001168888 నెంబర్ ద్వారా సుక్షితులైన సిబ్బంది వినియోగదారులకు తగిన సమాచారం అందిస్తుంది. అలాగే వినియోగదారుల హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ ప్రత్యేక సర్వీస్ నెంబర్ ద్వారా అభ్యంతరాలను వ్యక్తం చేసి తగిన సేవలను పొందవచ్చు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..