ప్రయాణికుల కోసం ఈ-పోర్టల్ ప్రారంభించిన సౌదీ ఏవియేషన్
- March 17, 2021
సౌదీ:ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు సౌదీ సివిల్ ఏవియేషన్ ఈ-పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పోర్టల్ సేవలను ప్రారంభించింది. ఈ-పోర్టల్ ద్వారా సౌదీ పౌర విమానయాన సంస్థ ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. వినియోగదారులకు సంతృప్తికర సేవలను అందించటం, సర్వీస్ లో క్వాలిటీ పెంచటమే ఈ-పోర్టల్ లక్ష్యం. వినియోగదారులు తమకు కావాల్సిన సమాచారాన్ని, ప్రయాణ వివరాలను, తమ అందాల్సిన సేవలను డిజిటల్ సహాయంతో క్షణాల్లోనే పొందవచ్చు. ట్విట్టర్ ద్వారా ఆటోమెటిక్ రెస్పాన్స్ వచ్చేలా ఈ-పోర్టల్ టెక్నాలజీ వినియోగదారులకు సేవలు అందించనుంది. అలాగే 8001168888 నెంబర్ ద్వారా సుక్షితులైన సిబ్బంది వినియోగదారులకు తగిన సమాచారం అందిస్తుంది. అలాగే వినియోగదారుల హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ ప్రత్యేక సర్వీస్ నెంబర్ ద్వారా అభ్యంతరాలను వ్యక్తం చేసి తగిన సేవలను పొందవచ్చు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







