అక్రమ వలస దారుల లక్ష్యంగా ప్రవాసీ కోటా బిల్లు..కువైట్ మంత్రి క్లారిటీ
- March 19, 2021
కువైట్:తమ ప్రభుత్వం గతేడాది ప్రతిపాదించిన ప్రవాసీ కోటా బిల్లు..కేవలం తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులను లక్ష్యంగా చేసుకొని రూపొందించామని కువైట్ మంత్రి వెల్లడించారు. భారత పర్యటనకు వచ్చిన కువైట్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ నాజర్ అల్-మహ్మద్ అల్-సబా..భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ప్రవాసీ కోటా బిల్లు లక్ష్యాలను ఆయన వివరించారు. తాము ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని..దాదాపు 170 దేశాల పౌరులు కువైట్లో ఉంటున్నారని గుర్తు చేశారు. వారి వారి జాతీయత ఆధారంగా ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకోవటమే కువైట్ లక్ష్యం అనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అయితే..గతేడాది ప్రతిపాదించిన ప్రవాసీ కోటా ముఖ్య లక్ష్యం దేశంలోని మెజారిటీ సంఖ్యలో ఉన్న విదేశీయులను తగ్గించటమేనని తెలిసిందే. ప్రస్తుతం కువైట్లో స్థానికులు 30 శాతం ఉంటే..ప్రవాసీయులు 70 శాతం వరకు ఉన్నారు. ప్రవాసీ కోటా బిల్లు ద్వారా దేశంలో ప్రవాసీయుల సంఖ్యను 30శాతానికి తగ్గించుకోవాలన్నది బిల్లు అసలు ఉద్దేశం. ఇక భారతీయుల విషయానికి వస్తే కువైట్లో 9 లక్షల వరకు ఇండియన్లు ఉన్నట్లు కువైట్ మంత్రి వెల్లడించారు. అయితే ప్రవాసీ కోటా బిల్లు అమలులోకి వస్తే ఆ సంఖ్య 2 లక్షలకు తగ్గుతుంది. మిగిలిన వాళ్లంతా భారతదేశానికి తిరుగుప్రయాణం అవ్వాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







