4 భాషల్లో ట్రాఫిక్ అవేర్నేస్ సేవలు ప్రారభించిన పోలీసులు
- March 19, 2021
అబుధాబి:వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించేందుకు అబుధాబి పోలీసులు ఎఫ్ఎం సేవలను ప్రారంభించారు. అరబిక్, ఉర్దూ, ఇంగ్లీష్, తమిళం భాషల్లో 24 గంటల పాటు సూచనలు చేస్తుంటారు. ఎమిరాతి పరిధిలోని మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్ చెక్ పాయింట్లకు సమీపంలోకి రాగానే వాహనదారులు ఎలాంటి నిబంధనలు పాటించాలన్నది ఎఫ్ఎం ద్వారా 4 భాషల్లో నిరంతరాయంగా సూచిస్తూనే ఉంటారు. చెక్ పాయింట్ కు సమీపంలోకి రాగానే వాహనాల వేగాన్ని తగ్గించాలి, హెడ్ లైట్ వెలుతురును తగ్గించాలి, క్రమశిక్షణతో ఒకే లేన్ లో వెళ్లాలి, ఫేస్ మాస్కులు ధరించాలి, కుటుంబేతరులు ఒకే వాహనంలో ప్రయాణం చేస్తుంటే వారి సంఖ్య ముగ్గురికి మించి ఉండకూడదు తరహా నిబంధనలను ఎఫ్ఎం ద్వారా గుర్తుచేస్తుంటారు. అలాగే ఎమిరాతి ఐడీ, అల్ హోస్న్ యాప్ లో పీసీఆర్ రిపోర్ట్ చూపించాలి. అలాగే కింగ్డమ్ లోని ఏ విమానాశ్రయంలో దిగినా..వారు ఎక్కడికి వెళ్తున్నారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. తనఖీ కేంద్రాల తగ్గర ఫోటోలు తీయటం పూర్తిగా నిషిద్ధం. చెక్ పాయింట్ కు 200 మీటర్ల సమీపానికి వాహనం చేరుకోగానే ఎఫ్ఎం ద్వారా ఇలా సూచిస్తుంటారు. తద్వారా తనిఖీ కేంద్రాల దగ్గర అధికారులకు అడిగిన వివరాలను వాహనదారులు వెంటనే చూపించేందుకు ప్రయాణికుల్లో అవగాహన ఏర్పడుతుంది. ఇదిలాఉంటే...ట్రాఫిక్ జాం, రోడ్డు ప్రమాదాలు, వాతావరణ హెచ్చరికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు ఇప్పటికే ఎఫ్ఎం సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఎఫ్ఎం ద్వారా నాలుగు భాషల్లో తనఖీ కేంద్రాల దగ్గర పాటించాల్సిన నిబంధనలను 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చారు అబుధాబి పోలీసులు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









