కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 416 మందిపై కేసు నమోదు
- March 20, 2021
దోహా:కోవిడ్ రూల్స్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్న ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు..ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లేటెస్ట్ గా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 416 మందిని అదుపులోకి తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు.అరెస్టైన వారిలో 395 మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్కులు ధరించలేదు. గఒకే వాహనంలో పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణించినందుకు మరో ఏడుగురిపై కేసు బుక్ చేశారు.ఎతేరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోనందుకు ఆరుగురిపై, భౌతిక దూరం పాటించని 8 మందిపై కేసు బుక్ చేసినట్లు అధికారులు వివరించారు. కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తున్నా..కొందరిలో మాత్రం మార్పు రావటం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉంటామని..నిబంధనలను పాటించని వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







