కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 416 మందిపై కేసు నమోదు
- March 20, 2021
దోహా:కోవిడ్ రూల్స్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్న ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు..ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లేటెస్ట్ గా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 416 మందిని అదుపులోకి తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు.అరెస్టైన వారిలో 395 మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్కులు ధరించలేదు. గఒకే వాహనంలో పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణించినందుకు మరో ఏడుగురిపై కేసు బుక్ చేశారు.ఎతేరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోనందుకు ఆరుగురిపై, భౌతిక దూరం పాటించని 8 మందిపై కేసు బుక్ చేసినట్లు అధికారులు వివరించారు. కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తున్నా..కొందరిలో మాత్రం మార్పు రావటం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉంటామని..నిబంధనలను పాటించని వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







