రియాద్ లోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడులు
- March 20, 2021
సౌదీ:సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా పొరుగు దేశంలోని తిరుగుబాటుదారులు తమ దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ సారి రాజధానిలోని ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి తెగబడ్డారు. అయితే..ఈ డ్రోన్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదని చమురు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. దాడి కారణంగా రిఫైనరీలో చెలరేగిన మంటలు చెలరేగాయని, వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. దీంతో ఆయిల్ సప్లై యధావిధిగా కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. ఇదిలాఉంటే..రియాద్ లక్ష్యంగా జరుగుతున్న దాడుల పట్ల సౌదీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక సంస్థలు, జనావాసాలు టార్గెట్ గా తీవ్రవాదుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయన్నారు. ఆయిల్ రిఫైనరీ వంటి ప్లాంట్ లపై దాడి చేయటం అంటే అంది ఒక్క సౌదీ అరేబియాపై మాత్రమే దాడిగా చూడలేమని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్ధిక రంగం, చమురు సరఫరాపై కూడా దాని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







