టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్త...
- March 20, 2021
ముంబై:భారతదేశపు అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులందరికీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వేతనాల పెంపును ప్రకటించింది.ఈ పెంపు ఏప్రిల్ 2021 నుండి అమల్లోకి వస్తుందని ఐటి కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 2021 నుండి సంస్థలోని అన్ని ప్రాంతాల అసోసియేట్లకు ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుందని టిసిఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది.నివేదికల ప్రకారం టిసిఎస్ ఆరు నెలల వ్యవధిలో ఇది రెండవసారి ఉద్యోగుల జీతం పెంచడం.అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా టిసిఎస్ ఉద్యోగులకు గత సంవత్సరం ఇంక్రిమెంట్ ఆలస్యం అయింది. ఇప్పుడు కంపెనీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం దాదాపు 12-14 శాతం సగటు జీతం పెంపు లభిస్తుంది.రెగ్యులర్ ప్రమోషన్ సైకిల్ ప్రకారం,టిసిఎస్ తన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం కొనసాగిస్తుందని తెలిపింది.ముంబై సంస్థలో 4 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు, వారు సంస్థ వేతనాల పెంపు నిర్ణయం నుండి లబ్ది పొందుతారు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







