కువైట్: 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు వ్యాక్సినేషన్
- March 20, 2021కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 16 ఏళ్ళు ఆ పైబడిన విద్యార్థులంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. స్పెషల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అబ్దుల్ మొహ్సెన్ అల్ హువైలియా మాట్లాడుతూ, ప్రైవేటు స్కూల్స్ సిబ్బంది అలాగే 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ నుంచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని కూడా అరికట్టవచ్చని ఆయన సూచించారు. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ కేవలం 16 ఏళ్ళ పైబడిన వారికి మాత్రమే ఉపయోగించాల్సి వుంటుంది. ఈ కారణంగా 16 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ కుదరదు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ