పాక్షిక కర్ఫ్యూ సమయం కుదింపు
- March 23, 2021
కువైట్: కరోనా కట్టడికి పాక్షిక కర్ఫ్యూ విధించిన కువైట్..కర్ఫ్యూ సమయంలో స్వల్ప మార్పులు చేసింది. ఇన్నాళ్లు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పాటించారు. అయితే..ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మార్చి 23(మంగళవారం ) నుంచి ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అలాగే కర్ఫ్యూ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్లు డెలివరీ సర్వీసులను అందించొచ్చని స్పష్టం చేసింది. ఇక నివాస ప్రాంగణాల్లో సాయంత్రం 8 గంటల వరకు జనాలు బయట నడిచేందుకు అనుమతి ఉంటుంది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. రెండు డోసులు తీసుకొని వారం రోజులు పూర్తైన వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మొదటి డోసు మాత్రమే తీసుకుంటే ఐదు వారాల తర్వాతే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!