భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 23, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.నాలుగు నెలల క్రితం నుంచి తగ్గుతూ వస్తున్న కేసులు ఇప్పుడు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి.  కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.  కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించారు.మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు.  ఇక తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం, దేశంలో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కి చేరింది.ఇందులో 1,11,81,253 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,45,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్  లో కరోనాతో 199 మంది మృతి చెందారు.దీంతో భారత్  లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,166కి చేరింది.రోజువారీ రికవరీ కేసుల సంఖ్య పాజిటివ్ కేసులు అధికంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com