భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 23, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.నాలుగు నెలల క్రితం నుంచి తగ్గుతూ వస్తున్న కేసులు ఇప్పుడు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించారు.మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు. ఇక తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం, దేశంలో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కి చేరింది.ఇందులో 1,11,81,253 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,45,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 199 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,166కి చేరింది.రోజువారీ రికవరీ కేసుల సంఖ్య పాజిటివ్ కేసులు అధికంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
తాజా వార్తలు
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర







