యెమన్లో శాంతి స్థాపనకు సౌదీ కొత్త ప్రతిపాదనలు
- March 23, 2021
సౌదీ:ఆరేళ్లుగా రావాణకాష్టంలా రగలిపోతున్న యెమెన్లో శాంతి స్థాపనకు సౌదీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. యెమెన్లో ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఇరు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని కింగ్డమ్ విదేశాంగ మంత్రి ప్రతిపాదించారు. అలాగే వాయు, జల మార్గాలపై నిషేధాన్ని కొన్ని ప్రాంతాల్లో ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందులోభాగంగా సనలోని ఎయిర్ పోర్టు, హోడైడాలోని నౌకాశ్రయం మీదుగా చమురు, అహార దిగుమతులు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. సౌదీ ప్రతిపాదనలను అంతర్జాతీయ సమాజం గుర్తించిన యెమన్ ప్రభుత్వం కూడా స్వాగతించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు, తిరికి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు హౌతీ తిరుగుబాటుదారులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. సౌదీ ప్రతిపాదనలకు హౌతిస్ సానుకూలంగా స్పందించిన పక్షంలో కాల్పుల విరమణ, జల, వాయు రవాణాపై నిషేధం ఎత్తివేత అమలులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







