ఒమన్ ప్రయాణీకులకు కొత్త క్వారంటైన్ నిబంధనల ప్రకటన

- March 23, 2021 , by Maagulf
ఒమన్ ప్రయాణీకులకు కొత్త క్వారంటైన్ నిబంధనల ప్రకటన

మస్కట్: సుల్తానేట్‌కి వచ్చే ప్రయాణీకులకు 29 మార్చి (సోమవారం) 2021 నుంచి కొత్త క్వారంటైన్ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ఓ సర్క్యులర్ జారీ చేసింది. సహాలా ద్వారా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిమిత్తం హోటళ్ళలో అకామడేషన్ తప్పక బుక్ చేసుకోవాల్సి వుంటుంది ఒమన్ వచ్చే ప్రయాణీకులు. సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. సహాలా ద్వారా కన్‌ఫర్మ్‌డ్ టికెట్ ప్రయాణీకుడు కలిగి వున్నాడా.? లేదా.? అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎయిర్ లైన్స్ సంస్థలదే. గత సర్క్యులర్లలో పేర్కొన్న నిబంధనలు కొనసాగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com