18 రాష్ట్రాల్లో కరోనా ‘కొత్త వేరియంట్’
- March 24, 2021
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విస్తరిస్తుంది. కరోనా వేగంగా విస్తరించేందుకు కరోనా వైరస్ కొత్త వేరియంట్లు కారణమని వైద్య వర్గాలు చెబుతున్నయి. ఇండియాలోనూ కొత్త కరోనా వేరియంట్ కూడా ఉన్నట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.
భారత్లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్(SARS-CoV-2) జన్యువులను శాస్త్రవేత్తలు పరిశీలించగా.. జీనోమ్ సీక్వెన్స్ లో సరికొత్త వేరియంట్ ను గుర్తించామని కన్సోర్టియమ్ ఆఫ్ జీనోమిక్స్(ఐఎన్ఎస్ఏసీఓజీ) ప్రకటించింది.
కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన జీనోమిక్స్ కన్సోర్టియంలో దేశంలోని మొత్తం జాతీయ పరిశోధనశాలలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. కొవిడ్ 19 వైరస్ కేసులకు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ను ఐఎన్ఎస్ఏసీఓజీ స్టడీ చేస్తున్నది. తాజా పరిశోధనలో వివిధ దేశాలకు చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్లతో పాటు భారత్కు చెందిన ప్రత్యేకమైన వేరియంట్ను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. కొత్త వేరియంట్ ను 18 రాష్ట్రాల్లో గుర్తించినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది.
జీనోమిక్స్ ల్యాబ్లు ఇప్పటి వరకు 10787 పాజిటివ్ కేసులను పరిశీలించి 771 వేరియంట్లను గుర్తించాయి. వీటిల్లో 736 శ్యాంపిళ్లలో యూకే వేరియంట్ వైరస్, 34 శ్యాంపిళ్లలో సౌత్ ఆఫ్రికా వేరియంట్లను గుర్తించారు.
మహారాష్ట్ర నుంచి సేకరించిన శ్యాంపిళ్లలో వైరస్ ఎక్కువగా పరివర్తన చెందినట్లు గుర్తించారు. E484Q, L452R మ్యుటేషన్లు కారణంగా మనిషిలోని ఇమ్యూనిటీపై అధికంగా ప్రభావం చూపుతుంది. దాదాపు 20 శాతం వరకు శ్యాంపిళ్లలో ఇలాంటి మ్యుటేషన్ వైరస్లను కనుగొనడం ఆందోళన పెంచుతుందని వైద్యశాఖ అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









