కర్ఫ్యూ టైంలో వాకింగ్ పై డ్రోన్ల అవగాహన ప్రచారం
- March 25, 2021
కువైట్:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చిన కువైట్ ప్రభుత్వం..కర్ఫ్యూ సమయంలో సడలింపులు, పాటించాల్సిన నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారాన్ని చేపట్టింది. ఇందుకోసం డ్రోన్లను వినియోగిస్తోంది. కర్ఫ్యూ సమయం ప్రారంభమైన తొలి రెండు గంటలు ప్రజలు తమ నివాస ప్రాంగణాల్లో వాకింగ్ చేసుకోవచ్చని, అలాగే వ్యాయమం చేసుకునేందుకు కూడా అనుమతించిన విషయం తెలిసిందే. అయితే..ఈ వెసులుబాటు కేవలం వాకింగ్ కోసం మాత్రమేనని...వాహనాల్లో తిరిగేందుకు పర్మిషన్ లేదని కువైట్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డ్రోన్ల సాయంతో ప్రచారం నిర్వహించనుంది. తొలుత సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల పాటు కర్ఫ్యూ విధించినా..ఆ తర్వాత కర్ఫ్యూ సమయాన్ని 11 గంటలకు కుదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాకింగ్ చేసుకోవచ్చు. ఇక రెస్టారెంట్ల డెలివరీ సర్వీస్ ను రాత్రి 10 గంటల వరకు కొనసాగించవచ్చు.
తాజా వార్తలు
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు









