కర్ఫ్యూ టైంలో వాకింగ్ పై డ్రోన్ల అవగాహన ప్రచారం
- March 25, 2021
కువైట్:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చిన కువైట్ ప్రభుత్వం..కర్ఫ్యూ సమయంలో సడలింపులు, పాటించాల్సిన నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారాన్ని చేపట్టింది. ఇందుకోసం డ్రోన్లను వినియోగిస్తోంది. కర్ఫ్యూ సమయం ప్రారంభమైన తొలి రెండు గంటలు ప్రజలు తమ నివాస ప్రాంగణాల్లో వాకింగ్ చేసుకోవచ్చని, అలాగే వ్యాయమం చేసుకునేందుకు కూడా అనుమతించిన విషయం తెలిసిందే. అయితే..ఈ వెసులుబాటు కేవలం వాకింగ్ కోసం మాత్రమేనని...వాహనాల్లో తిరిగేందుకు పర్మిషన్ లేదని కువైట్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డ్రోన్ల సాయంతో ప్రచారం నిర్వహించనుంది. తొలుత సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల పాటు కర్ఫ్యూ విధించినా..ఆ తర్వాత కర్ఫ్యూ సమయాన్ని 11 గంటలకు కుదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాకింగ్ చేసుకోవచ్చు. ఇక రెస్టారెంట్ల డెలివరీ సర్వీస్ ను రాత్రి 10 గంటల వరకు కొనసాగించవచ్చు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!