రయ్యా హైవే పునరుద్ధరణ ఫేజ్ 1 పనులు మొదలు
- March 26, 2021
బహ్రెయిన్:12 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో చేపడుతున్న రయ్యా హైవే పునరుద్ధరణ పనులకు సంబంధించి తొలి దశ త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇస్సామ్ ఖలాఫ్ వెల్లడించారు.మొత్తం 17 బిడ్లు టెండర్ ప్రాసెస్లో వచ్చాయి.ఏప్రిల్ 2021లో మొదలై ఎనిమిది నెలల్లో అంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. మూడు ఫేజుల్లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తారు.ఈ రోడ్డు పునరుద్ధరణతో ట్రాఫిక్ సమస్యలు తీరడంతోపాటు, కనెక్టివిటీ బాగా పెరుగుతుంది.భూ సేకరణ ఆరు కిలోమీటర్ల మేర పూర్తయ్యిందనీ దీనికోసం 3.16 మిలియన్ దినార్లను పరిహారంగా చెల్లించామనీ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









