ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 28, 2021
అమరావతి:ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..ఇవాళ వెయ్యి దాటేశాయి కరోనా కేసులు.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 31,142 సాంపిల్స్ పరీక్షించగా.. 1005 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.గతేడాది నవంబర్ 26 తర్వాత వేయి కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.ఇక గత 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు.ఇదే సమయంలో 324 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు..దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,98,815కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,86,216కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 5394 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,205 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.ఇక,ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,49,90,039 సాంపిల్స్ ని పరీక్షించారని బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









