భారత్కు మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు
- March 28, 2021
న్యూ ఢిల్లీ:భారత అమ్ములపొదిలోకి మరో పది రాఫెల్ యుద్ధ విమానాలు చేరుకోనున్నాయి. దీంతో భారత వైమానిక దళంలోని యుద్ధ విమానాల సంఖ్య 21కు చేరుకోనుంది.ఇప్పటికే 11 విమానాలు..అంబాలలోని 17వ స్వ్కాడ్రన్లో చేరాయి.మరో రెండు,మూడు రోజుల్లో 3 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి భారత్ రానున్నాయని తెలిపారు.వచ్చే నెలలో రెండవ విడతలో మరో 7-8 యుద్ధ విమానాలు ఇక్కడకు చేరుకుంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీటి రాకతో వైమానిక దళం మరింత బలోపేతం కానుందని అన్నారు.మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్ 2016లో ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే.కొన్ని విమానాలు గత ఏడాది జులై-ఆగస్టుకు భారత్కు చేరుకున్నాయి.వాటిని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









