మూడో వన్డేలో భారత్ ఘన విజయం..
- March 28, 2021
పూణే:మూడో వన్డేలో ఇంగ్లండ్పై టీం ఇండియా ఘన విజయం సాధించింది.అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లోనూ చెలరేగిపోయిన టీం ఇండియా... 7 పరుగులతో ఇంగ్లండ్పై విజయం సాధించింది.దీంతో 3 వన్డేల సిరీస్ను టీం ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది.మూడు ఫార్మాట్లోనూ ఇంగ్లండ్పై టీం ఇండియా సిరీస్లు గెలుచుకుంది. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 322-9 చేసి ఓటమి చవి చూసింది.ఇక ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ సామ్ కరన్ అద్భుత పోరాటంతో టీం ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.కరన్ 83 బంతుల్లో 95 పరుగులు చేశాడు.ఇందులో 3 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. ఠాకూర్ 4 వికెట్లు, భువీ 3 వికెట్లు, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు.ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీం ఇండియా.. 50 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. టీం ఇండియా బ్యాట్స్మెన్స్లో పంత్, ధావన్ రాణించారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







