మూడో వన్డేలో భారత్ ఘన విజయం..
- March 28, 2021
పూణే:మూడో వన్డేలో ఇంగ్లండ్పై టీం ఇండియా ఘన విజయం సాధించింది.అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లోనూ చెలరేగిపోయిన టీం ఇండియా... 7 పరుగులతో ఇంగ్లండ్పై విజయం సాధించింది.దీంతో 3 వన్డేల సిరీస్ను టీం ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది.మూడు ఫార్మాట్లోనూ ఇంగ్లండ్పై టీం ఇండియా సిరీస్లు గెలుచుకుంది. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 322-9 చేసి ఓటమి చవి చూసింది.ఇక ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ సామ్ కరన్ అద్భుత పోరాటంతో టీం ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.కరన్ 83 బంతుల్లో 95 పరుగులు చేశాడు.ఇందులో 3 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. ఠాకూర్ 4 వికెట్లు, భువీ 3 వికెట్లు, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు.ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీం ఇండియా.. 50 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. టీం ఇండియా బ్యాట్స్మెన్స్లో పంత్, ధావన్ రాణించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







