మూడో వన్డేలో భారత్ ఘన విజయం..
- March 28, 2021
పూణే:మూడో వన్డేలో ఇంగ్లండ్పై టీం ఇండియా ఘన విజయం సాధించింది.అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లోనూ చెలరేగిపోయిన టీం ఇండియా... 7 పరుగులతో ఇంగ్లండ్పై విజయం సాధించింది.దీంతో 3 వన్డేల సిరీస్ను టీం ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది.మూడు ఫార్మాట్లోనూ ఇంగ్లండ్పై టీం ఇండియా సిరీస్లు గెలుచుకుంది. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 322-9 చేసి ఓటమి చవి చూసింది.ఇక ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ సామ్ కరన్ అద్భుత పోరాటంతో టీం ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.కరన్ 83 బంతుల్లో 95 పరుగులు చేశాడు.ఇందులో 3 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. ఠాకూర్ 4 వికెట్లు, భువీ 3 వికెట్లు, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు.ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీం ఇండియా.. 50 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. టీం ఇండియా బ్యాట్స్మెన్స్లో పంత్, ధావన్ రాణించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









