మూడో వన్డేలో భారత్ ఘన విజయం..

- March 28, 2021 , by Maagulf
మూడో వన్డేలో భారత్ ఘన విజయం..

పూణే:మూడో వన్డేలో ఇంగ్లండ్‌పై టీం ఇండియా ఘన విజయం సాధించింది.అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ చెలరేగిపోయిన టీం ఇండియా... 7 పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.దీంతో 3 వన్డేల సిరీస్‌ను టీం ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది.మూడు ఫార్మాట్‌లోనూ ఇంగ్లండ్‌పై టీం ఇండియా సిరీస్‌లు గెలుచుకుంది. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 322-9 చేసి ఓటమి చవి చూసింది.ఇక ఇంగ్లండ్‌ జట్టులో ఆల్‌ రౌండర్‌ సామ్‌ కరన్‌ అద్భుత పోరాటంతో టీం ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.కరన్‌ 83 బంతుల్లో 95 పరుగులు చేశాడు.ఇందులో 3 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.భారత్‌  బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఠాకూర్‌ 4 వికెట్లు, భువీ 3 వికెట్లు, నటరాజన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.ఇక అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా.. 50 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీం ఇండియా బ్యాట్స్‌మెన్స్‌లో పంత్‌, ధావన్‌ రాణించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com