సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్..నాణ్యత లోపం..కోటిన్నర డోసుల వృధా..
- April 01, 2021
న్యూయార్క్: ఒకే డోసుతో కరోనాకు చెక్ పెట్టేలా జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్కు పెద్ద దెబ్బ పడింది. ఆ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ నాణ్యతా ప్రమాణాలు పాటించకోవడం వల్ల ఏకంగా కోటిన్నర డోసుల వ్యాక్సిన్ వృథా అయినట్లు న్యూయార్స్ టైమ్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ధృవీకరించినా.. కచ్చితంగా ఎన్ని డోసులు వృథా అయ్యాయో మాత్రం చెప్పలేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఓ బ్యాచ్ డోసులు మొత్తం వృథా అయ్యాయని ఆ సంస్థ చెప్పింది.
అసలు ఈ వ్యాక్సిన్లను ఫిల్లింగ్ స్టేజీకి కూడా తీసుకెళ్లలేదని తెలిపింది. నాణ్యత, భద్రతే తమ ప్రాధాన్యాలని జాన్సన్ అండ్ జాన్సన్ తేల్చి చెప్పింది. అయితే సాధ్యమైనంత త్వరగా తమ సింగిల్ డోస్ వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్న ఆ సంస్థకు ఈ వృథా పెద్ద దెబ్బే వేసింది. అటు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ వృథాపై విచారణ జరపడానికి సిద్ధమవుతోంది. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మరింత మంది నిపుణులను విచారణ కోసం ఎమర్జెంట్ సంస్థ దగ్గరకి పంపిస్తోంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







