మై11సర్కిల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రణ్‌వీర్‌ సింగ్‌

- April 01, 2021 , by Maagulf
మై11సర్కిల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రణ్‌వీర్‌ సింగ్‌

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీ గేమ్స్‌ 24×7 తన ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ మై11సర్కిల్ ‌(My11Circle) కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను నియమించినట్లు గురువారం ప్రకటించింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఆరంభానికి రెండు రోజుల ముందు, ఏప్రిల్‌ 6న విడుదలకానున్న ప్రచార కార్యక్రమాల్లో రణ్‌వీర్‌ కనిపించనున్నాడు.

భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, ఇండియా టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌ రహానె, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌, రషీద్‌ ఖాన్‌లు ఇప్పటికే మై11సర్కిల్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మై11సర్కిల్‌ మాతృ సంస్థ గేమ్స్‌ 24×7 ను 2019లో ప్రారంభించగా ప్రస్తుతం యాప్‌ను 70 మిలియన్ల మంది స్పోర్ట్స్‌ యూజర్లు వినియోగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com