GHMC కీలక నిర్ణయాలు..
- April 01, 2021హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి.. ఇక, ఆది నుంచి కోవిడ్ కేసులకు హైదరాబాద్ హాట్ స్పాట్గానే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్లోనూ గ్రేటర్ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)... బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.. పబ్లిక్ ప్లేసుల్లో ఎవ్వరూ గుమ్మిగూడవద్దని సూచించిన GHMC.. 6 అడుగుల దూరం పాటించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరూ ఉమ్మకూడదు స్పష్టం చేసిన అధికారులు..ఒకవేళ ఉమ్మితే ఫైన్ విధిస్తామని ప్రకటించారు. మాస్కు లేక పోతే ఉద్యోగులు అయినాసారే GHMC ఆఫీసులోకి అనుమతి లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. సిబ్బంది ఆఫీస్ లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా చేతులు శానిటేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది GHMC. కాగా, ఇప్పటికే, GHMC కార్యాలయాల్లో సందర్శకులకు నో ఎంట్రీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు