GHMC కీలక నిర్ణయాలు..
- April 01, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి.. ఇక, ఆది నుంచి కోవిడ్ కేసులకు హైదరాబాద్ హాట్ స్పాట్గానే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్లోనూ గ్రేటర్ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)... బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.. పబ్లిక్ ప్లేసుల్లో ఎవ్వరూ గుమ్మిగూడవద్దని సూచించిన GHMC.. 6 అడుగుల దూరం పాటించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరూ ఉమ్మకూడదు స్పష్టం చేసిన అధికారులు..ఒకవేళ ఉమ్మితే ఫైన్ విధిస్తామని ప్రకటించారు. మాస్కు లేక పోతే ఉద్యోగులు అయినాసారే GHMC ఆఫీసులోకి అనుమతి లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. సిబ్బంది ఆఫీస్ లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా చేతులు శానిటేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది GHMC. కాగా, ఇప్పటికే, GHMC కార్యాలయాల్లో సందర్శకులకు నో ఎంట్రీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







