GHMC కీలక నిర్ణయాలు..
- April 01, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి.. ఇక, ఆది నుంచి కోవిడ్ కేసులకు హైదరాబాద్ హాట్ స్పాట్గానే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్లోనూ గ్రేటర్ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)... బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.. పబ్లిక్ ప్లేసుల్లో ఎవ్వరూ గుమ్మిగూడవద్దని సూచించిన GHMC.. 6 అడుగుల దూరం పాటించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరూ ఉమ్మకూడదు స్పష్టం చేసిన అధికారులు..ఒకవేళ ఉమ్మితే ఫైన్ విధిస్తామని ప్రకటించారు. మాస్కు లేక పోతే ఉద్యోగులు అయినాసారే GHMC ఆఫీసులోకి అనుమతి లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. సిబ్బంది ఆఫీస్ లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా చేతులు శానిటేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది GHMC. కాగా, ఇప్పటికే, GHMC కార్యాలయాల్లో సందర్శకులకు నో ఎంట్రీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









