ఏప్రిల్ 22 వరకు కర్ఫ్యూ పొడగింపు
- April 02, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాధి నియంత్రణకు కర్ఫ్యూను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. మరో రెండు వారాల పాటు అంటే ఏప్రిల్ 22 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే రోజు వారి పాక్షిక కర్ఫ్యూ సమయాన్ని పది గంటలకు కుదించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పవిత్ర రమదాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని డెలివరీ సర్వీసులకు సడలింపు ఇచ్చారు. రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు రెస్టారెంట్లు, కేఫ్లు, కేటరింగ్ సర్వీసులు ఆన్లైన్ డెలివరీ కొనసాగించవచ్చు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు అవుట్డోర్ ఎక్సర్సైజ్కి అనుమతి ఉంటుంది. పండగ దృష్ట్యా రాత్రి 7 నుంచి మధ్య రాత్రి వరకు షాపింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఫ్రీ బుకింగ్ తర్వాతనే షాపింగ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్









