ఉద్యోగి భార్యకు వేతనం చెల్లించిన ఏరీస్ సంస్థ

- April 02, 2021 , by Maagulf
ఉద్యోగి భార్యకు వేతనం చెల్లించిన ఏరీస్ సంస్థ

షార్జా: దీపా ప్రభిరాజ్ అనే ఓ మహిళ మార్చి 28న ఏరీస్ గ్రూప్ నుంచి వేతనం అందుకున్నారు. ఆమె ఆ సంస్థ కోసం ప్రత్యక్షంగా ఎలాంటి సేవలూ అందించలేదు. కానీ, ఆమె భర్త మాత్రం ఆ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన పేరు ప్రభిరాజ్ నటరాజన్. ఏరీస్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. ఏరీస్ సంస్థలో పనిచేస్తున్నవారి భార్యల పేర్లను నెలవారీ వేతనాల లిస్టులో ఇటీవల చేర్చారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓ సోహన్ రాయ్ వెల్లడించారు. పెళ్ళయ్యాక మూడేళ్ళపాటు కంపెనీతో పనిచేస్తున్నవారికి ఈ ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. 25 శాతం వేతనాన్ని పొందుతారు ఈ కేటగిరీలో.చాలా కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, తమ ఉద్యోగుల కస్టంతో తమ కంపెనీ స్థిరమైన ఎదుగుదల ప్రదర్శిస్తోందని సోహన్ రాయ్ వెల్లడించారు.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com