తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

- April 03, 2021 , by Maagulf
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

హైదరాబాద్:కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు కలవరపెడుతోంది... దేశవ్యాప్తంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కరోనా పంజా విసిరిన మొదటల్లో ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ అన్ని సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కరోనా క్వారంటైన్ సెంటర్లను మళ్లీ ప్రారంభం కానున్నాయి.. ఇక, హైదరాబాద్‌లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి క్వారంటైన్ సెంటర్‌ను పరిశీలించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.. తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధితన అధికారులను ఆదేశించారు.మళ్లీ కేసులు పెరుగుతుండడంతో.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లపై కీలక నిర్ణయం తీసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com