కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి
- April 04, 2021
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో టీకా తీసుకున్నారు. గత నెల 1న తమిళనాడులోని చెన్నై ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి డోసు వేయించుకున్నారు. దేశంలో మార్చి 1న రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7,59,79,651 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదటి విడుత వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమయ్యింది. మొదటి విడుతలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు, అనంతరం ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా వేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







