కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి

- April 04, 2021 , by Maagulf
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌ దవాఖానలో టీకా తీసుకున్నారు. గత నెల 1న తమిళనాడులోని చెన్నై ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో మొదటి డోసు వేయించుకున్నారు. దేశంలో మార్చి 1న రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7,59,79,651 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మొదటి విడుత వ్యాక్సినేషన్‌ జనవరి 16న ప్రారంభమయ్యింది. మొదటి విడుతలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు, అనంతరం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీ చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com