ఏపీలో కరోనా కేసుల వివరాలు

- April 04, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,730 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,07,676 కు చేరింది. ఇందులో 8,90,137 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,300 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,239 మంది మృతి చెందారు.ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 842 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 31,072 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com