కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన BCCI...
- April 04, 2021
ముంబై:కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ఐపిఎల్ నిర్వహణపై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వాంఖడే స్టేడియంలో నిర్వహించతలపెట్టిన మ్యాచ్లన్నీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోపక్క ఒక్కొక్కరుగా ఐపిఎల్ క్రీడాకారులు కరోనా బారిన పడుతున్నారు.ముంబై, చెన్నై, ఆర్సిబి, ఢిల్లీ జట్లలో కొందరు ఆటగాళ్లు, సిబ్బంది కరోనాకు గురయ్యారు.దీంతో ఆందోళన నెలకొంది.ఈ క్రమంలోనే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తాజాగా బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టోర్నమెంట్ నిమిత్తం కేవలం ఆరు వేదికలనే ఎంపిక చేశామని, బయో బబుల్లో మ్యాచ్లు జరగనున్నాయని తెలిపారు. ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆటగాళ్లకు వ్యాక్సినేషన్పై కేంద్రంతో చర్చిస్తామని చెప్పారు. వ్యాక్సినేషన్ వారికి అవసరమని తెలిపారు. ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నమెంట్ నిర్వహణపై ఆలోచిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







