తదుపరి నోటీసు వచ్చ వేరకు చర్చిలు, దేవాలయాల మూసివేత

- April 05, 2021 , by Maagulf
తదుపరి నోటీసు వచ్చ వేరకు చర్చిలు, దేవాలయాల మూసివేత

ఒమన్:ఎక్కువమంది ప్రజలు గుమికూడకుండా వుండేందుకోసం చర్చిలు, దేవాలయాల్ని తదుపరి నోటీసు వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఇంటివద్దనే ప్రజలు ప్రేయర్స్, పూజలు చేసుకోవాల్సిందిగా అథారిటీస్ సూచించాయి. రువిలోని సెంట్ పీటర్ మరియు పాల్ కేథలిక్ చర్చి పారిష్ ప్రీస్ట్ ఫ్రాన్సిస్ రాల్ రమోస్, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు. ఏప్రిల్ 3 నుంచి తదుపరి నోటీసు వరకు చర్చి మూసివేసి వుంటుందని తెలిపారు. దేశంలోని దేవాలయాలు కూడా మూతపడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com