ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- April 05, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.నిన్న కేసుల సంఖ్య లక్షదాటిన విషయం తెలిసిందే.మహారాష్ట్ర,తమిళనాడు,పంజాబ్,కేరళ ప్రాంతాలల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి.ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉధృతి భయపెడుతోంది.ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రాలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు తీసుకుంది.టీకా కార్యక్రమంలో కీలక మార్పులు మార్పులు చేస్తూ సోమవారం కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 24గంటల పాటు వ్యాక్సిన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ ఉత్తర్వులు అన్ని టీకా కేంద్రాలకు వర్తించవని ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడో వంతు ఆసుపత్రులు రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకూ పని చేస్తాయని తెలిపింది. ప్రస్తుతం రాజధానిలో ప్రభుత్వం, ప్రైవేటు టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ ఆరోగ్య సిబ్బంది… ప్రజలకు టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఇకపై ఏ సమయంలోనైనా టీకా తీసుకునే సౌలభ్యం కలగనుంది.
రాజధానిలో ఆదివారం నాడు కొత్తగా 4 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే మొదటిసారి.రెండు రోజుల క్రితమే కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అధికారులతో సమీక్ష నిర్వహించింది.ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు